Pages

Monday, August 13, 2018

మూర్ఖత్వానికి పరాకాష్ట

కొన్ని మతాలలో మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే వృత్తాంతం ఇది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని వైజ్ఞానికంగా రుజువు చేసినందుకు గెలీలియోకు మరణశిక్ష విధించారు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం శాస్త్రీయ జ్ఞానం కొద్దిగా కూడా లేనివాళ్ళ చేత వ్రాయబడిన మత గ్రంధాన్నే ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటామనే మత పెద్దల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాని, అప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశం వైజ్ఞానికంగా ఎంతో ముందడుగు వేసింది. ప్రాచీన ఖగోళవేత్త అయిన ఆర్యభట్ట - భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని ప్రపంచానికి చాటిచెప్పాడు. వేదాలకి అనుబంధంగా ఉండే జ్యోతిషశాస్త్రంలో కూడా వివిధ గ్రహ గతుల్ని ఖచ్చితంగా లెక్కలు కట్టడమే కాకుండా, సూర్యునికి, భూమికి మధ్య దూరాన్ని, భూగోళ వైశాల్యాన్ని, చంద్రుని వ్యాసార్థాన్ని ఇప్పటి లెక్కలకు సరిపోయే రీతిలో సిద్ధాంతాల్ని రూపొందించి ఉంచారు. ఏ ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయో, సూర్య, చంద్ర గ్రహణాల అవధుల్ని, అవి ఎప్పుడు సంభవిస్తాయో కూడా పూర్తి శాస్త్రీయంగా లెక్కించగలిగారు. అదీ మన భారతీయ శాస్త్రవేత్తల, మహర్షుల గొప్పదనం.