Pages

Thursday, December 29, 2011

వైదిక మతం సైన్స్‌కి వ్యతిరేకమా?


    చాలా మంది అనుకున్నట్టుగా, ప్రపంచంలో మిగతా మతాల మాదిరిగా కాకుండా వైదిక మతం శాస్త్ర విజ్ఞానానికి పెద్ద పీట వేసింది. హిందువులకు ముఖ్యమైన మత గ్రంధాలు వేదాలు. 'వేదం' అనే పదం 'విత్‌' అనే ధాతువు నుండి వచ్చింది. విత్‌ అంటే 'జ్ఞానం' అని అర్థం. మానవ సమాజం యొక్క మొదటి మెట్టు జ్ఞానంతోనే మొదలయిందని దీని అర్థం. మనిషి నాగరికత మొదటి అడుగు వేసింది నిప్పును కనిపెట్టడంతోనే అని అందరికీ తెలుసు. అందుకే ప్రపంచంలోనే మొట్టమొదటి, అతి ప్రాచీనమైన గ్రంధమైన ఋగ్వేదం 'అగ్నిమీళే పురోహితమ్‌' అనే అగ్ని దేవుని ఋక్కు (ప్రార్థన)తో మొదలయింది. హిందూ మత గ్రంధాలు ఎన్నడూ అంధ విశ్వాసాలను నూరిపోయవు. అలాగే తమ మతమే గొప్పది అనే తత్వాన్ని గాని, మరో మతాన్ని అణగదొక్కాలనే విద్వేషాన్ని గాని ఏ హిందూ మత గ్రంధమూ చెప్పదు. వైదిక మతం ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుంది. ప్రశ్నించడం జ్ఞానం తెలిసిన వాడి హక్కు. ఫలానా గ్రంధంలో ఇలాగే ఉంది కాబట్టి దాని గురించి మీకు ప్రశ్నించే హక్కు, అధికారం లేదు అని ఎవరూ అనలేరు. ప్రశ్నించ గల నేర్పు, ఎన్ని రకాలుగా ప్రశ్నించవచ్చునో కూడా ఒక శాస్త్రంగా రూపుదిద్దుకున్నాయి. అదే 'తర్కశాస్త్రం' - వేదాంగాలలో ఒకటి. వేదాంతమైన ఉపనిషత్తు కూడా గురు శిష్యుల మధ్య సంవాద రూపంలో ఉంటాయి. అంటే శిష్యుడు తనకు వచ్చిన ఒక అనుమానాన్ని గురువుని అడుగుతాడు. దానికి గురువు చక్కటి, సమాధానం చెబుతాడు. ఒకవేళ గురువుగారు చెప్పిన సమాధానంతో శిష్యుడు తృప్తి పడకపోతే, లేదా ప్రక్కనున్న మరో శిష్యుడికి దానికి సంబంధించిన మరో అనుమానం వస్తే, మరల గురువుగారిని తన ప్రశ్నని గురించి అడగవచ్చు. ఈ విధంగా మనం ఇపుడు చెప్పుకుంటున్న గ్రూప్‌ డిస్కషన్స్‌ ఆ రోజుల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధమైన చర్చల ద్వారా వేద విషయాలలోని సంక్లిష్టత అందరికీ అర్థమయ్యే సులభ భాషలో ఉపనిషత్‌ రూపంలో భద్రపరచబడింది. ఉపనిషత్తులలో లేని అంశమంటూ లేదు. ఈ సృష్టి ఏర్పడిన విధానం - భగవంతుని గుణ గణాలు - ఆయన రూపం - ఆత్మ - పరమాత్మ - వీరిద్దరికీ గల సంబంధం - ప్రకృతి శక్తులు ఏమిటి - మనిషికి ప్రకృతికిగల సంబంధం - జననం - మరణం - పునర్జన్మ - వీటి రహస్యాలు ఇలా మనిషికి వచ్చే ప్రతీ అంశం గురించి ఉపనిషత్తులలో కూలంకంషంగా అధ్యయనం చేసారు - మన ప్రాచీన ఋషులు, యోగులు.

    మానవ నాగరికతకు మూల స్థంభమే వేదం. మనకి జన్మ నిచ్చిన స్త్రీని మాతృ మూర్తిగా పిలవాలని ప్రపంచానికి నేర్పింది వేదం. అందుకే ఏ భాషలోనైనా అమ్మని పిలిచే పిలుపులో 'మ' అనే అక్షరం తప్పని సరిగా ఉంటుంది. మన జన్మకి కారకుడైన పురుషుడిని తండ్రిగాను, వీరందరినీ ఒక కుటుంబంగా వ్యవహరించాలని, నిత్యం మనం చేయవలసిన పనులు, సమాజం నడవడిక ఎలా ఉండాలో, రాజు ఎలా పరిపాలించాలో అన్నీ తెలిపింది వేదం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి నాగరికత నేర్పింది వేదం. వేదం అంటే జ్ఞానం - జ్ఞానం అంటే వేదం. ఇక వేదం జ్ఞానాన్ని వ్యతిరేకించే అవకాశం ఎక్కడుంది?

    ఇదే కాకుండా ఈ రోజు ఆధునిక ప్రపంచానికి వచ్చే అనేక రుగ్మతల నుండి విముక్తి ప్రసాదిస్తున్న అతి ప్రాచీన - ఋషి ప్రసాదిత - యోగ విజ్ఞానం కూడా వేద కాలంలోనే రూపొందించబడింది. మనిషి శరీరంలో ఎన్ని నాడులు ఉంటాయి - ఏఏ నాడి పని తీరు ఎలా ఉంటుంది - ఏమి చేస్తే ఆయా అంగాల తీరుని మెరుగుపరచుకోవచ్చును - మనిషి తన ఆరోగ్యం కోసం ఏమి చేయాలి - ఇత్యాది విషయాలన్నీ యోగ శాస్త్రంలో నిబిడీకృతతం చేయబడ్డాయి. అవన్నీ కనిపెట్టడానికి ఇప్పటి వైద్య శాస్త్రానికి మరో వందేళ్ళ కాలం పట్టవచ్చు. ఇది అతిశయోక్తి కాదు - సంపూర్ణమైన నిజం. ప్రయోగాత్మకంగా నిరూపించబడిన సత్యం. ఎటువంటి స్వార్థం లేకుండా, కేవలం లోక క్షేమమే తమ పరమావధిగా తలచి మానవాళి మొత్తానికి ప్రాచీన ఋషి పుంగవులు అందించిన కల్తీ లేని, వ్యాపార ధృక్పదం లేని నిజమైన జ్ఞానం.

    భరధ్వాజుని వైమానిక శాస్త్రం - శుశ్రుతుని శస్త్ర విద్య పరిజ్ఞానం (ఆపరేషన్‌) - వరాహమిహిరుడు, ఆర్యభట్ట మొదలగు వారి ఖగోళ శాస్త్రం, భాస్కరుని లీలా గణితం (ప్రపంచంలో మొట్టమొదటి ఆల్జీబ్రా గణితం) - పాణిని వ్యాకరణ సూత్రాలు (మొట్టమొదటి కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌), ప్రపంచానికే తలమానికమైన దశాంశ పద్దతి వాడుక, అంకెల్ని కనిపెట్టడం, సున్నాని కనిపెట్టడం - ప్రపంచంలో మొట్టమొదటి శాస్త్రీయమైన క్యాలండర్‌ రూపకల్పన - ఋతువుల విభజన - ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకి అంతు ఉండదు. ఇవన్నీ ఎందుకు - రెండేళ్ళ తరువాత గ్రహణం ఎప్పుడు వస్తుందో ఖగోళ శాస్త్రవేత్తని లేదా ప్లానిటేరియం వాళ్ళని అడిగి చూడండి - వాళ్ళు చెప్పలేరు. కాని ఎక్కడో రేలంగిలో ఉన్న తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారినో మరో ప్రఖ్యాత సిద్ధాంతి గారినో అడిగి చూడండి - ఖచ్చితంగా లెక్కలు వేసి - కూర్చున్న చోట నుండి లేవకుండా సమాధానం చెప్పగలరు. అది కూడా ఎలా - గ్రహణం ఏ రోజు, ఎన్ని ఘడియల - ఎన్ని విఘడియలకు మొదలవుతుంది - ఆ సమయంలో గ్రహ స్థితి ఏమిటి - ఎన్ని గంటల ఎన్ని నిముషాల పాటు ఆ గ్రహణం ఉంటుంది - దాని స్పర్శా కాలం ఎంత - సంపూర్ణ గ్రహణం ఎంత సేపు ఉంటుంది ఇలా పూర్తి వివరాల్ని సంపూర్ణంగా అందించగలరు. ఇంతటి అద్భుతమైన ఖగోళ పరిజ్ఞానం ఈ రోజు ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న ఏ ఒక్క సమాజానికి లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. పైగా ఇదంతా కూడా ఎటువంటి ఆధునిక పరికరాలు లేని (మనం అనుకుంటున్నాం- నిజమో కాదో తెలియదు) ప్రాచీన కాలంలోనే మన పూర్వీకులు వ్రాసి ఉంచిన శాస్త్రాల ఆధారంగా గణించి చెప్పినటువంటిది. అంటే ఖగోళ శాస్త్రంలో ఎంతటి అద్భుతమైన కృషి జరిగిందో ఇటే ఊహించవచ్చు.

    మిగతా మతాల్లో జ్ఞానం అనేది ఒక నిషిద్ధ ఫలం. జ్ఞానాన్ని తెలుసుకోవడం దేవుడిని ఎదిరించడమే. అందుకే ఆడమ్‌, ఈవ్‌లు సాతాను మాట విని నిషిద్ధ జ్ఞాన ఫలాన్ని తిని దేవుని శాపానికి గురయ్యారు. కాని వైదిక మతంలో జ్ఞానమే రాజమార్గం. భగవంతుడిని చేరడానికి భక్తి, యోగ, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లో జ్ఞానమార్గానిదే అగ్రస్థానం. జ్ఞానిగా మారినవారు దేవునికి ఇష్టులవుతారు. వారు ఎప్పటికైనా భగవంతునిలో ఐక్యమవుతారంటోంది వేదం. అలా నేను అనే అహంకారం నశించి, భగవంతునిలో ఐక్యమవ్వడమే మోక్షం.

    ఇప్పటి తరం దేన్నయితే నిజమైన అభివృద్ధిగా భ్రమపడుతుందో - ఏ ప్రకృతి వినాశనాన్ని వ్యాపారం అనుకుంటున్నదో - ఏ శారీరక మానసిక అనారోగ్యాన్ని నాగరికత అనుకుంటున్నదో అటువంటి ప్రయోగాలన్నీ దీర్ఘకాలంలో మనిషి మనుగడకు, తద్వారా ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి. అందుచేత అటువంటి పరిజ్ఞానాన్ని ప్రాచీన కాలంలోనే సామాన్య ప్రజలకు అందకుండా చేశారు దీర్ఘదర్శులైన మన మహర్షులు.

    మరి ఇంతటి అద్భుతమైన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం ఉన్న భారతీయులు ఎందుకు మిగతా జాతులకి బానిసగా మారవలసి వచ్చింది. ప్రాచీన కాలంలో ప్రపంచానికే మార్గదర్శి అయిన భారత దేశం ఒక సామాన్య దేశంగా ఎందుకు మిగిలిపోయింది - భారతీయులంతా పర జాతికి తొత్తులుగా మారి వారు చెప్పిందే వేదంగా చెలామణీ అవుతూ  - వారి నాగరికత (?)ను అనుసరిస్తూ, అనుకరిస్తూ, తమ మూలాల్ని మరచిపోయి - ఒక నిస్సత్తువ జాతిగా మారి తమని తాము నిత్యం కించపరుచుకుంటూ - స్వార్థ పరంగా జీవిస్తున్నారు? వీటి గురించి నా తరువాతి పోస్టులో వివరిస్తాను.

అంత వరకు 'సర్వేజనా సుఖినోభవన్తు'.

80 comments:

  1. Beautiful presentation about Vedas. Thanks

    ReplyDelete
  2. కబుర్లెందుకు? హిందువులలో చాలా మందికి వేదాలలో ఏముందో తెలియదు. అందుకే కొత్తగా ఏ వస్తువు కనిపెట్టినా దాని గురించి వేదాలలో ముందే వ్రాసారని చెప్పుకోవడం జరుగుతోంది. ఒకప్పుడు క్రైస్తవులలో కూడా సాధారణ ప్రజలు బైబిల్ చదవకూడదని రూల్ ఉండేది. ప్రొటెస్టంట్ శాఖ స్థాపకుడు మార్టిన్ లూథర్ బైబిల్‌లో ఏముందో బయటపెట్టిన తరువాత కేథలిక్‌లు కూడా బయటపెట్టాల్సి వచ్చింది. హిందువులలో చాలా మందికి వేదాలలో ఏముందో ఇప్పటికీ తెలియదు. నేను రామాయణం, మహాభారతం, భగవత్‌గీత, ఖురాన్‌లు చదివాను. వైదిక గ్రంథాలు చదువుదామంటే అవి తెలుగులో అందుబాటులో లేవు. అందుబాటులో లేని గ్రంథాల గురించి ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు కదా. సంస్కృతం నేర్చుకుని వేదాలు తప్పకుండా చదువుతాను. వేదాలలో ఎంత వరకు సైన్స్ ఉందో, ఎంత వరకు మూఢత్వం ఉందో తెలిసిపోతుంది.

    ReplyDelete
  3. మరి ఇంతటి జ్ఞానామృతాన్ని మన పాఠ్యాంశాలలో ఎందుకు చేర్చరు. ? ఇదొక కుట్ర లాగా కనిపిస్తోంది.

    ReplyDelete
  4. chala baga chepparu

    ReplyDelete
  5. ప్రవీణ్
    ముందు తెలుగు సరిగ్గా నేర్చుకుని చావారా బడుద్ధాయ్. సంస్కృతం సంగతి తరువాత. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతుండట. సంసృతం రాకుండా గీత ఎలా చదివాడో ఈ మెంటల్ కేసు.

    ReplyDelete
  6. Brilliant Post Sir. Waiting for the next post.

    ReplyDelete
  7. @ Rao s Lakkaraju... thank u very much sir.

    @ ప్రవీణ్ శర్మ గారు... మన లాంటి వాళ్ళ కోసమే శ్రీమాన్ దాశరధి రంగాచార్యులు గారు నాలుగు వేదాలకి తెలుగు వ్యాఖ్యానం రాసి పెట్టారు. విశాలాంధ్ర వాళ్ళ బుక్ షాప్స్ లో కొనుక్కోవచ్చు. మరో ముఖ్య విషయం... వేదాల్లోని ప్రతీ శ్లోకానికీ అనేకమయిన అర్ధాలుంటాయి. అంటే భౌతిక పరమయిన అర్ధం ఒకటి వుంటే, ఖగోళ సంబంధమయిన అర్ధం వేరొకటి, అలాగే సైన్స్ పరమయిన అర్ధం వేరొకటి వుండొచ్చు. అందుకే వేదాల్ని అర్ధం చేసుకునేందుకు కేవలం సంస్కృతం ఒకటే వస్తే సరిపోదు, దానికి జ్యోతిషం, చందస్సు, నిరుక్తం, మొదలయిన వాటి మీద కూడా అవగాహ వుండాలి. ఇప్పుడు అవకాశం వుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా కృషి చేసి వేదాల్లో వున్న జ్ఞానాన్ని కొంతయినా ప్రపంచానికి అందించగలిగితే చాలా మంచిది.

    @ రాం గారు... మీ వయసెంతో నాకు తెలీదు.. కాని నా చిన్నప్పుడు పాఠ్యాంశాలు "మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ" అంటూ వేద శ్లోకాలతోనే మొదలయ్యేవి... ఇప్పుడంటే ప్రభుత్వాలకి కూడా బుద్ది లేక, దిక్కుమాలిన విషయాలతో సిలబస్ తయారు చేస్తున్నారు.. ఇది నిజంగా కుట్ర కాక మరేమిటి?

    @వీకెండ్ పొలిటీషియన్ గారు.. అనానిమస్ గారు... కృతజ్ఞతలు...

    ReplyDelete
  8. గీత గారి బ్లాగులో ప్రాచీన భారతీయ శస్త్ర వేత్తల గురించి సంపూర్ణ వివరణ ఇచ్చారు.. చదవండి...
    మన భారతీయ విజ్ఞానం గురించి మనం తెలుసుకుందాం
    http://yashodakrishnaallari.blogspot.com/2011/12/blog-post_29.html

    ReplyDelete
  9. excellent post.. great work sir!

    ReplyDelete
  10. "నేను రామాయణం, మహాభారతం, భగవత్‌గీత, ఖురాన్‌లు చదివాను."

    అవి చదివాక కూడా నీలో మార్పు లేదంటే, ఈ వితండవాదం చావలేదంటే బహుశా నీలో మానసికంగా ఏదో లోపం ఉన్నట్టుంది ప్రవీణ్.

    ReplyDelete
  11. మా వెదం లొ అన్నీ వున్నాఇ అని చెప్పుతారు యెమివు్న్నాఇ
    కొద్దిగా సైంటిఫిక్ గా వివరించండి వుదా:విమానం తయారి .వొద్దు గాని లొహాం గురించి గాని,లెకపొతె విదుత్ గురించి
    యెదాన్న ఒకటి, pin to pin చెప్పండి

    ReplyDelete
  12. @Praveen Sarma

    "...తెలుగులో అందుబాటులో లేవు..." You are wrong. Visalamdhra already published in Telugu. You yourself admitted you did not read Vedas. Then why and how you comment with such venomous sarcasm?? It is not wise and proper to comment on matters which you do not know. If you realise and understand this, you shall earn respect. Otherwise....

    ReplyDelete
  13. హే svk నువ్వు ఎప్పుడైనా పరశువేది అనే పేరు విన్నావా? ఓ సారి గూగులించి చూడు. నీ కోడి మెదడుకి అర్థం కాకపోతే నేను చేసేదేమీ లేదు.

    ReplyDelete
  14. ఆహా..వేదాల్లో లేనిదేందయ్యా. నువ్వు గొరిగిచ్చుకొనే బొచ్చుకు ఎమి మంత్రాలు చదవాలో రాసేరు. చదవలేదా

    ReplyDelete
  15. "ఆహా..వేదాల్లో లేనిదేందయ్యా. నువ్వు గొరిగిచ్చుకొనే బొచ్చుకు ఎమి మంత్రాలు చదవాలో రాసేరు. చదవలేదా"

    సాటి అజ్ఞాతా తెలిసో తెలియకో కరెక్ట్ గా చెప్పారు. తల్లిదండ్రుల్లో ఎవరైనా పొతే శిరోముండన సమయంలో ఏ ఏ మంత్రాలు చదవాలో కూడా వేదాల్లో ఉన్నాయి.

    ReplyDelete
  16. చక్కటి వివరణ

    @ ప్రవీణ్ శర్మ గారు
    "నేను రామాయణం, మహాభారతం, భగవత్‌గీత, ఖురాన్‌లు చదివాను."
    ఆహా! ఇన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివిన మీరు ఎంతో గొప్పవారు!అన్నీ తెలిసిన మీకు మేము చెప్పవలసిందేముంది.ఇంత విజ్ఞానమున్నమీరు ఎందుకు అన్నింటిలో తలదూర్చి వితండవాదం చేస్తుంటారు?

    ReplyDelete
  17. "..తమ మతమే గొప్పది అనే తత్వాన్ని గాని, మరో మతాన్ని అణగదొక్కాలనే విద్వేషాన్ని గాని ఏ హిందూ మత గ్రంధమూ చెప్పదు"

    చల్లని మాట.

    ReplyDelete
  18. వేదాలలో కొన్ని భాగాలు మాత్రమే తెలుగులోకి అనువాదమయ్యాయి. అందుకే సంస్కృతం నేర్చుకున్న తరువాతే వేదాలు చదువుదామని అనుకుంటున్నాను. ఖురాన్ తెలుగులోకి అనువాదమయ్యింది కానీ హదీస్ తెలుగులోకి అనువాదమవ్వలేదు. అరబిక్ భాషని ముస్లిం మదరసాలలో తప్ప ఎక్కడా నేర్పించరు. సంస్కృతం అలా కాదు, ఎక్కడైనా నేర్చుకోవచ్చు.

    ReplyDelete
  19. చాలా బావుంది జగదీష్ గారూ. చక్కటి వివరణనిచ్చారు.

    "హిందూ మత గ్రంధాలు ఎన్నడూ అంధ విశ్వాసాలను నూరిపోయవు. అలాగే తమ మతమే గొప్పది అనే తత్వాన్ని గాని, మరో మతాన్ని అణగదొక్కాలనే విద్వేషాన్ని గాని ఏ హిందూ మత గ్రంధమూ చెప్పదు. వైదిక మతం ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుంది. "

    చాలా చక్కగా చెప్పారు. సనాతన ధర్మం ఏదీ ఎవరి నెత్తిన రుద్దదు ఇతర మతాల లాగా. భయమూ పెట్టదు. మంచీ చెడుకి తారతమ్యం చెప్తుంది. అంతే. ప్రశ్న ద్వారానే జిజ్ఞాస కలుగుతుంది. అదే నేర్పుతుంది సనాతనధర్మం.

    "భగవంతుడిని చేరడానికి భక్తి, యోగ, జ్ఞాన, వైరాగ్య మార్గాల్లో జ్ఞానమార్గానిదే అగ్రస్థానం."

    నా దృష్టిలో అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. యోగంతో జ్ఞానం, జ్ఞానంతో భక్తి, తద్వారా వైరాగ్యం అని అనిపిస్తోంది నాకు.

    ReplyDelete
  20. విజయమోహన్ గారూ

    ఇక్కడ రామాయణం అంటే అదెవత్తో లంగానాయకి రాసిన విషవృక్షం

    భారతం అంటే టీవీ లో వచ్చిన సీరియల్

    ఖురాన్ అంటే ముడు రుపాయలకు దొరికే అనువాదం అన్నమాట

    అర్థం చేసుకోరూ!

    ReplyDelete
  21. అజ్ఞాత: వేదాలలో శిరోముండనానికి మంత్రాలయినా ఉన్నాయి. మరి మీ మార్క్స్ గాడిదకొడుకు రాసిన మేనిఫెస్టొలో ఏముందో పందులు కూడ అసహ్యించుకునే చెత్త తప్ప. పందుల కన్నా హీనులయిన Commie దరిద్రులకు అది కమ్మగానే ఉంటూందిలే.

    ReplyDelete
  22. Wonderful post! చాలా వివరంగా వ్రాసారు.

    ReplyDelete
  23. చాలా బాగా రాశారండీ

    ReplyDelete
  24. జగ్‌దీశ్ గారు, ముందు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మనలో ఎంత మందికి వేదాలు తెలుసు? చిన్నప్పుడు నేను మహాభారతం చదువుతోంటే "సన్యాసంలో కలిసిపోవాలనుకుంటున్నావా? స్కూల్ పుస్తకాలు చదువు. అవి చదివితే బాగుపడతావు. పురాణాలు చదివితే ఏమీ రాదు" అని మా పెద్దవాళ్ళే అనేవాళ్ళు. అలా అనే పెద్దవాళ్ళే ప్రతి విషయంలోనూ జాతకాలు, ముహూర్తాలు, వాస్తు లాంటి పట్టింపులకి పోయేవాళ్ళు. మనకి మత గ్రంథాలు చదవడం మీద ఆసక్తి లేనప్పుడు మనం మతం గురించి గొప్పగా చెప్పుకోవడం ఎందుకు? చిన్నప్పుడు నేను కొన్న మహాభారతం తెలుగు అనువాదం ఇప్పటికీ నా దగ్గర ఉంది. మా ఇంటిలో మహాభారతం, ఖురాన్ లాంటివి చదివిన వ్యక్తిని నేనొక్కడినే.

    ReplyDelete
  25. ప్రవీణూ
    మీ ఎర్రబాబుల్లో ఎంతమంది ఆ బవిరిగెడ్డం గాడిదకొడుకు రాసిన మేనిఫెస్టోని చదివారు? మరి వాళ్ళు గొప్పలు చెప్పుకోవట్లేదా ఎందుకూ పనికిరాని కమ్యూనిజం గురించి?

    ReplyDelete
  26. నాయనా ప్రవీణ్ శర్మా మీ జిజ్ఞాసకు చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ అన్నీ అర్ధం కావు. అందుకని బాధపడాల్సిన అవుసరము లేదు.

    ReplyDelete
  27. జపాన్ గురించి ఏమీ తెలియనివానికి జపాన్‌లో pan handlers దగ్గర రోబోట్లు ఉంటాయంటే నమ్మేస్తాడు. అలాగే వేదాలలో ఏముందో తెలియనివాళ్ళకి వేదాలలో విమానాలు, రాకెట్ల తయారీ శాస్త్రం ఉందని చెపితే నమ్మేస్తారు. అణువుల గురించి కణాదుడు అనే భారతీయ శాస్త్రవేత్త ఊహించి చెప్పినప్పుడు అప్పటి శాస్త్రవేత్తలే నమ్మలేదు. అప్పట్లో విమానాల శాస్త్రం వగైరా తెలుసు అంటే ఎలా నమ్మాలి? చిన్నప్పుడు నేను కూడా మత గ్రంథాలు చదివేవాణ్ణి. మత భక్తుల మాటలు ఒకలాగ, ఆచరణ ఇంకోలాగ ఉంటాయి. మతం మీద విశ్వాసం బలంగా లేకపోయినా మతం పేరుతో పాకిస్తాన్‌ని ద్వేషించడం, అలా ద్వేషించకూడదు అని చెపితే దేశద్రోహులు అనడం జుగుప్సకరంగా ఉంది. నా స్నేహితురాలు స్వప్న చెప్పేది "గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళ గురించి నేను పట్టించుకోను కానీ మతం పేరుతో వేరేవాళ్ళని ద్వేషించేవాళ్ళంటేనే నాకు అసహ్యం" అని. వేదాలలో నిజంగా సైన్స్ ఉంటే మన ఇండియా ఎందుకు ఇంత వెనుకబడింది? యూరోప్‌లో టంకశాలలో నాణేలు తయారు చేసే కంచరివాడు (bronze-smith) సీసం పలక ఉపయోగించి ముద్రణ యంత్రం తయారు చేశాడు. కానీ మన ఇండియావాళ్ళకి బ్రిటిష్‌వాళ్ళు వచ్చేంత వరకు ముద్రణ యంత్రాల గురించి ఎందుకు తెలియలేదు? అన్నీ వేదాలలోనే ఉన్నాయనుకుంటే ఇలాగే ఉంటుంది.

    ReplyDelete
  28. నీకెంత పిచ్చి ఉందో నీ స్వప్నకి అంతకన్న పిచ్చి ఉన్నట్టుందిలే. సరయిన జోడీ ఇద్దరు పిచ్చోళ్ళదీను.

    మరి నీ దిక్కుమాలిన కమ్యూనిజంలో సైన్స్ ఉందా? ఉంటే కమ్యూనిష్టు దేశాలెందుకు అడుక్కుతింటున్నాయి? కమ్యూనిష్టు చైనా ఎందుకు పెట్టుబడిదారీ విధానంవైపు వెళ్ళాల్సొచ్చింది.

    ReplyDelete
  29. ఆ ప్రశ్నలకి విశేఖర్ ఎప్పుడో సమాధానాలు చెప్పాడు కదా. నువ్వు అడిగేవి అరిగిపోయిన రికార్డ్ ప్రశ్నలే. జగదీశ్‌కి నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు.

    ReplyDelete
  30. పై అజ్ఞాత
    ఆ స్వప్న రహస్య వ్యవహారాలన్నీ నాకు తెలుసులే. మలకూ నీకు కూడా తెలియని విషయాలు చాలా వున్నాయి. నాకో మయిల్ కొట్టు.

    (నేనెవర్నో ఈ పాటికి అర్ధమయిపోయుండాలి నీకు)

    ReplyDelete
  31. నీ బ్రతుకే ఒక అరిగిపోయిన రికార్డురా. వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తోక ముడిచి పారిపోయే నువ్వు కూడ ఒక మనిషివేనా? థూ నీ బ్రతుకు.

    ReplyDelete
  32. హిందువులలో తమ మతానికి చెందిన గ్రంథాలు చదివేవాళ్ళే తక్కువ. అయినా నేను ఖురాన్ కూడా చదివాను. అన్నీ వేదాలలోనే ఉన్నాయనే ముందు మనం వేదాలు చదువుదాం. కొత్తగా కనిపెట్టినవన్నీ మన పూర్వికులకి ముందే తెలుసు అనీ, ముందే ఊహించి వ్రాసారనీ అంటే ఏమీ ప్రయోజనం ఉండదు.

    ReplyDelete
  33. ఎస్పీ జగదీష్ గారు,

    మీరు ఒట్టి ఎస్పీ గాదు. క్రిస్పే కూడా. చాలా బాగా సంక్షిప్తం గా రాసారు. మంచి సమాలోచన.

    ప్రశ్న ద్వారా మీదు మిక్కిలి ఐన దాని ని తెలుసుకోవడం అన్న దానికి ఒక చిన్న ఉదాహరణ నాకు తెలిసినది ఒక ఋక్కు - రిగ్వేదం నించి - 'క' సూక్తం. దీనిని హిరణ్య గర్భ సూక్తం అని కూడా అంటారు.

    మరొక్క ఉదాహరణ, నాసదీయ సూక్తం.

    నిజం గా చదవాలి అందులో సత్తా ఉందా లేదా అన్నది గ్రహించడానికి. ఎందుకంటే సంస్కృతం లో ఉంది. అనువాదాలు ఓ పాటి సహాయ కారి.తద్వారా అందులో ని కొన్ని కొన్ని టిని గ్రహిస్తే ఈ మన 'ఫాస్ట్' లైఫే (సో కాల్డ్) కాలం లో గోప్పేమో !

    ఇక రిగ్వేదపు ఆఖరి సూక్తం - సంఘ సూక్తం- 'సహ చిత్తమేషాం' మన ఆంగ్ల భాషలో చెప్పాలంటే - 'mind boggling concept'.

    జిలేబి.

    ReplyDelete
  34. (నేనెవర్నో ఈ పాటికి అర్ధమయిపోయుండాలి నీకు)
    _____________________________________

    Who is this? Bond/Sagar? No one else knows many details. I'm surprised you guys are on Telugu blogs.

    ReplyDelete
  35. >>>>>
    నిజం గా చదవాలి అందులో సత్తా ఉందా లేదా అన్నది గ్రహించడానికి. ఎందుకంటే సంస్కృతం లో ఉంది. అనువాదాలు ఓ పాటి సహాయ కారి.తద్వారా అందులో ని కొన్ని కొన్ని టిని గ్రహిస్తే ఈ మన 'ఫాస్ట్' లైఫే (సో కాల్డ్) కాలం లో గోప్పేమో !
    >>>>>
    ఫాస్ట్ లైఫ్ అంటే నేను కూడా ఉండేది టౌన్‌లోనే. అయినా మత గ్రంథాలు ఎలా చదువాను?

    ReplyDelete
  36. ఇస్లామిక్ దేశాలలో ప్రతివాడూ ఖురాన్ చదువుతాడు. ఇండియాలో ఒక్కడు వేదం చదివితే గొప్ప అనుకుంటారు.

    ReplyDelete
  37. ఇస్లామిక్ దేశాలలో ప్రతివాడూ ఖురాన్ చదువుతాడు. ఇండియాలో ఒక్కడు వేదం చదివితే గొప్ప అనుకుంటారు.
    _________________________________________________________________________


    For a change, this guy is talking sense out here!

    ReplyDelete
  38. నేను సమాధానం చెప్పింది జగదీశ్‌కి, నీకు కాదు.

    ReplyDelete
  39. నేణు కూడ మాట్లాడుతోంది జగదీష్ తోనే. నీతో కాదు.

    ReplyDelete
  40. ప్రవీణ్ శర్మా,

    <<<ఫాస్ట్ లైఫ్ అంటే నేను కూడా ఉండేది టౌన్‌లోనే. అయినా మత గ్రంథాలు ఎలా చదువాను?

    ఎలా చదివాను అని కోచ్చెను వెయ్యకూడదు. ఎందుకు చదివాను అని ప్రశ్నించి వుండాల్సింది !! వెరీ సింపుల్ ఈ బ్లాగుల్లో కామెంట్లు రాయడానికి. ఆ మాత్రం దానికి వేదం చదవాలా ? మా గొప్పే !

    హమ్మయ్య, ఈ ప్రవీణుడు ఇక విజ్రుంభిస్తాడు.!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  41. మత గ్రంథాలు ఎందుకు చదివాను అంటే జిజ్ఞాసతో చదివాను అని. మత గ్రంథాలు చదివినా తరువాత నాస్తికునిగా మారాననేది వేరే విషయం. కానీ ఇక్కడి ప్రశ్న ఏమిటంటే మత గ్రంథాలు చదవకుండానే లేని గొప్పలు చెప్పుకోవడం, ఏ సైంటిస్ట్ ఏది కనిపెట్టినా దాని గురించి వేదాలలో ముందే ఊహించి వ్రాసారనడం, మతం పేరుతో పాకిస్తాన్‌ని ద్వేషించడం ఎందుకు? అని.

    ReplyDelete
  42. ఫాస్ట్ లైఫ్ అంటున్నారు కాబట్టి నాది కూడా ఫాస్ట్ లైఫే అని చెపుతున్నాను. మీ బెంగళూరులాగ ఇక్కడ మెట్రో ట్రైన్‌లు లేకపోయినా కలెక్టర్ ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్‌కి వెళ్ళే టౌన్ బస్సులు ఉన్నాయి. మీరు ఉదయం ఆఫీస్‌కి వెళ్ళి సాయింత్రం వస్తే నేను ఉదయం షాప్‌కి వెళ్ళి రాత్రి తొమ్మిది గంటలకి వచ్చేవాణ్ణి. అయినా నాకు మత గ్రంథాలు చదవడానికి టైమ్ ఎలా దొరికింది? హిందూ మత గ్రంథాలని తెలుగు పుస్తకాల షాప్‌లలోనే కొన్నాను కానీ ఖురాన్‌కి మస్జీద్ దగ్గర కొన్నారు. నాకు టైమ్ ఉన్నప్పుడు నా కంటే ఖాళీగా ఉన్నవాళ్ళకి టైమ్ ఉండగా ఈ సోకాల్డ్ ఫాస్ట్ లైఫ్‌లో?

    ReplyDelete
  43. జగ్‌దీశ్, నీది కూడా DTP సెంటరే కదా, నువ్వు కూడా నీ DTP సెంటర్‌లో ఖాళీ టైమ్‌లో చదువుకోవచ్చు కదా.

    ReplyDelete
  44. "...పురాణాలు చదివితే ఏమీ రాదు" అని మా పెద్దవాళ్ళే అనేవాళ్ళు...." Your Elders only are standard for entire India!!

    ReplyDelete
  45. గ్లోబలైజేషన్ వచ్చిన తరువాత అందరూ ఇలాగే అనుకుంటున్నారు "చదువు, సంపాదించు" అని. మత గ్రంథాల మీద ఆసక్తి చూపిస్తున్నది ఎవరు? మా పెద్దవాళ్ళు ఉదాహరణలు అనే చెప్పాను కానీ మోడల్స్ అని చెప్పలేదే.

    ReplyDelete
  46. అదే, వాళ్ళు స్టాండర్డ్స్ అని చెప్పలేదు.

    ReplyDelete
  47. జగదీష్ గారూ మంచి వ్యాసం వ్రాసి తెలియని విషయాలు తెలుసుకోవాలి అనుకునే జిజ్ఞాసువులకు ఆసక్తి కలిగించారు, ధన్యవాదాలు. తరువాత కామెంట్లకి మోడరేషన్ పెట్టి, చెత్త జల్లెడ పట్టి విషయానికి సంబంధించినవి మాత్రమే అనుమతిస్తే వ్యాసం, ఆ వ్యాసం మీద చర్చ అర్ధవంతంగా జరుగుతుంది.లేకపోతే ప్రతిదీ ఎవరికి తెలిసిన గీటురాయి మీద వాళ్ళు పరీక్షకు పెడితే తేలేది ఎవరెవరు ఎంత అజ్ఞానులో అనే కాని, వేదాల్లో ఉండె జ్ఞానం గురించిన సవ్యమైన చర్చ జరగదని నా అభిప్రాయం.

    ReplyDelete
  48. పిచ్చికుంకా! మతం పేరుతో ద్వేషించే మాటయితే పాకిస్తానే కాదు మొత్తం ఇస్లామిక్ దేశాలన్ననింటినీ ద్వేషించాలి. పాకిస్తాన్ మీదే ఎందుకు కోపం అంటే ఆ దేశం మనతో యుద్ధం చేసింది కాబట్టీ. నీ లాంటి పిచ్చోళ్ళకి విశేఖర్ లాంటి వెర్రోళ్ళకి అది అర్థమయి ఛస్తేగా?

    ReplyDelete
  49. "...వాళ్ళు స్టాండర్డ్స్ అని చెప్పలేదు..." That's the point. So whatever you encountered need not necessarily be the case in every family. There are thousands of families where such readings are not only encouraged but send their children for special teachings from Gurus.

    ReplyDelete
  50. ఇక్కడ వేదాల గురించి చర్చ జరుగుతోంటే ఈ చర్చతో సంబంధం లేని కమ్యూనిజం గురించి అడిగి టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నించారు. నేను వాళ్ళకి కావాలనే సమాధానం చెప్పలేదు. చెపితే నేనే టాపిక్ డైవర్ట్ చేస్తున్నానంటారు. వాళ్ళ మోడస్ ఓపరాండీ అలాంటిదే. అసలు ప్రశ్నకి సమాధానం చెప్పలేక వేరే ఏవో అడిగి టాపిక్ డైవర్ట్ చేస్తుంటారు.

    ReplyDelete
  51. శివరాం గారు, నాకు తెలిసి మా వీధిలో వేద భవనానికి వారానికొకసారి వెళ్ళేవాడు ఒకరే ఉన్నారు. వేద భవనం నా షాప్‌కి దగ్గర కాబట్టి ఆ విషయం తెలిసింది. మిగిలినవాళ్ళు జాతకాలు, ముహూర్తాలు, వాస్తు చూసుకోవడం తప్ప మత గ్రంథాల పఠనం చేసేది తక్కువే.

    ReplyDelete
  52. నా తండ్రే. మరి గ్లోబలైజేషన్ గురించి వాగింది ఎవడు బాబూ? నీ ఆల్టర్ ఈగోనా? తిక్క సన్నాసి!

    ReplyDelete
  53. LOL .. interesting stuff.

    Anonymous - Do you have sometime tonight? ( I know its late, but if you are still awake?)

    Zilebi garu,

    Looks like you are intent on Making this another Star Tapaa of 2011 ... your anticipation was really great!

    ReplyDelete
  54. ఆల్టర్ ఇగో లేదూ, శ్రాద్ధమూ లేదు. డబ్బు సంపాదించడం బిజీలో పడేవాళ్ళెవరూ మత గ్రంథాలు చదవరు. వాళ్ళు కెరీర్ గురించే ఆలోచించి అకెడమిక్ పుస్తకాలు మాత్రమే చదువుతారు. అందుకు కారణం గ్లోబలైజేషన్ అని తెలియదా? తెలిసింది తెలియనట్టు నటించడం ఎందుకు?

    ReplyDelete
  55. నీకు పిచ్చెక్కి మెంటలోడివవ్వటాకికి కారణం కమ్యూనిజమని నీకు కూడా తెలియదా? తెలిసీ తెలియనట్టు నటించటం ఎందుకు? నువ్వు గ్లోబలైజేషన్ని ఎందుకు వాడావో నేను కమ్యూనిజాన్ని కూడా అందుకే లాగాను.

    Malak
    How about lobby if you are still awake? Coffee??

    ReplyDelete
  56. Jagdeesh, these anonymouses are intentionally diverting topics with discussions about communism. Keep comments moderation. Otherwise, your blog will be like another Zuran blog.

    ReplyDelete
  57. ప్రవీణు గారూ !
    మీవాదనల వెనుక వేదన ...ఎవరో మనసుకెక్కించిన విద్వేషం గమనిస్తున్నాను నేను చాలారోజులుగా .మనం వేదం చదవలేకపోవటం వేదం తప్పా ? కాదుకదా > కృతయుగాదులలో ఎక్కువమంది వేదాభ్యసనపరులేఅని మనచరిత్ర [మీరు నమ్మినా నమ్మకున్నా]వలన తెలుస్తుంది. యుగధర్మాన్ననుసరించి ఈ యుగంలో మనుషులు వేదదూరులవుతారని అసలు భగవంతునికన్నా భౌతిక సుఖాలకు సంబంధించిన విషయాలకే ప్రాముఖ్యత నిస్తారని,భాగవతం,భవిష్యపురాణాదులలో చెప్పబడిఉంది . దానికి మనమేకారణంగాని వేదం కాదుకదా ? అప్పటి వ్యక్తుల ఆభరణాదులు,వాడినపరికరాలు,వాహనాలన్నీ లోహ విజ్ఞానం మనకు చాలాచక్కగానే తెలుసని స్పష్టం చేస్తున్నాయి , పాదరసాన్ని మండించటం ద్వారా విమానాలనునడిపించే విద్యను ప్రసాధించిన మహర్షులు మనపూర్వీకులు . అయితే కాలగమనంలో తప్పనిసరియై కొన్ని విద్యలను రహస్యం చేసి వాటిని లోకానికందకుండా చేయదలచారు మహాత్ములు. కారణం కూడా మనమే.
    ఉదాహరణకు అర్జునుడు,అశ్వత్థామ ఇద్దరూ ద్రోణుని వద్ద చదివినవారే. అస్త్రశస్త్రాలను సంపాదించినవారే . అవి ఈనాటి అణుబాంబులకన్నా ప్రమాదకరమైనవి . అయితే యుద్దం చివరిదాకా నిగ్రహం కోల్పోకుండా అర్జునుడు దివ్యాస్త్రాలను ప్రయోగించకుండా యుద్దం చేశాడు .[ఎక్కడొ ఒకటి రెండుసన్నివేశాలలో నష్టం పెద్దగాలేకుండా వాడాడు] .అవి పూర్తిస్తాయిలో ఉపయోగిస్తే తనశత్రువులే కాదు సృష్టిలో జీవరాశి కంతటికీ ప్రమాదం కనుక తన వ్యక్తిగత రాగద్వేషాలను నియంత్రించుకోగలసమర్ధుడాయన . నేర్చుకున్నవారందరూ అంతసమర్ధులా ? యుధ్ధం చివరలో తామసిక భావసంపన్నుడగు అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగిమ్చాడు. దాన్ని నిరోధించటానికి అర్జునుడు దాన్నే ప్రయోగించకతప్పలేదు. దానివల్ల ప్రళయం సంభవిమ్చే ప్రమాదమేర్పడినప్పుడు పెద్దలు హెచ్చరిమ్చగా దాన్ని ఉపసంహరించే సామర్ధ్యం లేని అశ్వథ్థామ తెల్లముఖం వేయగా చివరకు ఆవిద్యతెలిసిన అర్జునుడే ఉపసంహారం చేయవలసి వచ్చింది.
    ఇక యుగధర్మాన్ననుసరించి వచ్చే ఈ యుగమానవులు .అల్పశక్తివంతులూ ,సహనం లేనివారుగా ఉంటారు కనుక ఇటువంటి విద్యలు అందుబాటులో ఉంటే సృష్టి నాశనానికి తెగబడతారని ఊహించి మహాత్ములు ఈవిద్యలను లుప్తం చేశారు .
    ఇప్పుడున్న పరిజ్ఞానం నిజంగా మానవులకు ఉపయోగపడుతుందా ? గుండెమీద చెయ్యేసుకుని చెప్పండి. భూమిని డోల్లచేయగల రాకాశియంత్రాలతో ఏమిచేస్తున్నాడు ? కొండకోనలను కుళ్లగొట్టి అక్కడ నివసించే ప్రాణులను,వనవాసులకు ఆశ్రయంలేకుండాచేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు./ ఎన్ని వసతులున్నా వీడుతినేది ఒక్కముద్ద . ఉండేది వందసంవత్సరాలు . కాని శాస్వతమైన సృష్టినే ధ్వంసంచేయటానికి పూనుకున్నాడు. ఈ మాయలు మర్మాలు,రాక్షసవిద్యలు అందుబాటులో లేని వనవాసులను చూదండి ఎంత ఆనందంగా స్వచ్చంగా,బ్రతుకుతున్నారో. ఎందుకీ అభివృధ్ధి. ఇవన్నీ ఊహించే కావాలనే ఈ అపూర్వ వేదవిజ్ఞానాన్ని దూరంచేశారని., పిచ్చివానిచేతిలో కత్తిలా ఈ విజ్ఞాననం మారకూడదనిమనపెద్దలభావనకావచ్చు. వాడు వాన్ని పొడుచుకుంటాడో లేక ఎదుటీవాణ్ని పొడుస్తాడొ తెలియదుకదా >
    కనుకనే ఇవి రహస్యం గావున్నాయి. ఇక మీలా లోకశ్రేయస్సును కాంక్షించి ఆవిద్యలను ఉపయోగించాలనుకునేవారికి వారిశ్రమ,సద్బుధ్దిని అనుసరించి మహాత్ములశక్తి వెన్నంటిఉండి. అందజేస్తుంది.
    ఇప్పుడు మీరు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. శుభం కొనసాగండి. అనవసరంగా పరనింద,స్వీయపొగడ్త లవల్ల,వాదనలవల్ల వేదన తప్ప మిగిలేదేముంటుంది . [ఇది నేననుకుంటున్న మీకయితే]

    ఇక ఈ ధర్మాన్ని కించపరచాలని ధ్వంసం చేయాలనేసంకల్పంతో పనిచెస్తున్న కలిసేన లోనివారితేమాత్రం సమాధానం వేరు.
    మీరు మీప్రయత్నం ఎంతగాచేస్తే మేము అంతగా మాధర్మాన్ని అనుసరించేందుకు పోరాడతాము. హిందువులలో ఒకలక్షణముంది. ప్రేమకు లొంగుతారు. ద్వేషాన్ని క్షమిస్తారు .ధర్మంకోసం ధనమానప్రాణాలను తృణీప్రాయంగా వదలటానికి సిధ్ధమవుతారు అవసరమొచ్చినప్పుడు.
    ఇక మీరు వేరు మేము వేరా ? లేక మనమందరమూ ఒకటేనా తేల్చుకోవల్సింది మీరే . మాకైతే [హిందువులకు] సృష్టిలో ప్రతిప్రాణీ ఆత్మబంధువే .జైశ్రీరాం

    ReplyDelete
  58. @మలక్ భాయి,

    cerainly going to be another Star post of 2011. Already crossing 62! fast forward towards 100+! vacation is certainly rewarding.

    @ ప్రవీణు

    దుర్గేశ్వర మాష్టారు మాంచి మేటరు ఇచ్చారు. ఇక మీదే వేగం.

    జిలేబి.

    ReplyDelete
  59. జిలేబీ, వేగానికి ఎక్కడ టైమ్ ఉంది? ఈ రోజు ఇరవై తొమ్మిది. జనవరి ఎనిమిదిన ఒరిస్సాలోని కాకిరిగుమ్మ గ్రామానికి వెళ్దామనుకుంటున్నాను, ఫొటోలు తియ్యడానికి. అది ఎలాగూ డొకోమో టవర్లు లేని ప్రాంతం కనుక అక్కడి నుంచి కామెంట్లు వ్రాయలేను. ఈ వారం కూడా నాకు ఇక్కడ వ్యక్తిగత పనులు ఉన్నాయిలే. పనులైపోయిన తరువాత సిగ్నల్ అందని అడవుల్లోకి ఫొటోలు తియ్యడానికి వెళ్ళాలి. ఇక్కడ వేగమవ్వడానికి టైమ్ ఎక్కడుంది?

    ReplyDelete
  60. నా బ్లాగ్‌ని దర్శించినవారందరికీ ధన్యవాదములు. ఇప్పుడు అర్ధం అయింది. మనల్ని ఎందుకు పరాయి వాళ్ళు అన్నెసి సంవత్సరాలు పరిపాలించారో..... మనకి మనగురించి తెలీదు.... మన బుర్రలకి తోచదు... ఒక వేళ ఎవరయినా చెప్పినా అర్ధం కాదు.. మనదే నిజమని వాదిస్తాం... ఇప్పటికే 120 కామెంట్లు దాటిపోయాయి. అసలు విషయం వదిలేసి, నా బ్లాగుని తిట్లకి వేదిక చేసారు. అందుకే అన్ని కామెంట్లని తొలగించాను... బ్లాగు లోకంలో ఇంత బురద వుంటుందని ఇప్పుడే తెలిసింది. సహృదయంతో స్పందించిన అందరికీ కృతజ్ఞతలు...
    మీ
    జగదీష్

    ReplyDelete
  61. ప్రవీణ్ శర్మగారూ, మీరు జిజ్ఞాస కలవారు. సంతోషం. కాని, మీ ఆలోచనా ధోరణి ఒక్కటే సరయైనది అనుకుంటారు. కొంచెం యిబ్బంది కరమైనది మీ ధోరణి. మీరు యితరులంతా తప్పు త్రోవల్లో పోతున్నారు, అందరికీ తప్పు త్రోవలు చూపుతున్నారు అనుకుంటున్నారు. ఇది చాలా అభ్యంతరకరమైనది.

    దయచేసి ఒక విషయం గ్రహించండి. పుస్తకాలను చదివే వారు మూడు రకాలుగా ఉంటారు. ఒకటవరకం వాళ్ళు విజ్ఞాన సముపార్జనకోసం తెరచి ఉంచిన మనస్సుతో చదువుతారు. రెండవవరకం వాళ్ళు తమకు ఇష్టమైన పుస్తకాలే చదువుతూ అవి మాత్రమే సత్యమైన విషయాలను బోధిస్తున్నాయని విశ్వసిస్తూ ఉంటారు - తమకు ఇష్టంకాని విషయాల పైన వ్రాయబడ్డవి, ఇష్టం కాని వ్యక్తులు వ్రాసినవి అస్సలు పట్టించుకోరు - కొండొకచో ద్వేషిస్తారు, చులకనగా చూస్తారు. ఇక మూడో రకం చదువరులు. వీళ్ళు తమకు నచ్చని విషయాల, వ్యక్తుల పుస్తకాలూ చదువుతారు కాని ఆ చదివేది కేవలం రంధ్రాన్వేషణాబుధ్ధి తోనే గాని సత్యాన్వేషణబుధ్ధితో కాదు. మీరు యే పుస్తకాలు చదివారో, చదువుతున్నారో ఇంకా చదవబోతారో మీ యిష్టం. కాని మీరే రకం పాఠకులుగా ఉన్నారో మీరే గ్రహించుకోండి. మీరే రకం పాఠకులుగా ఉండాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి.

    అలాగే అహం వదిలి పెట్టండి. మీరు చదివినంత మాత్రాన మీకు సంపూర్ణంగా అర్ధమై తీరాలని నియమం యేమీ లేదు. మీరన్నారూ "సంస్కృతం నేర్చుకుని వేదాలు తప్పకుండా చదువుతాను. వేదాలలో ఎంత వరకు సైన్స్ ఉందో, ఎంత వరకు మూఢత్వం ఉందో తెలిసిపోతుంది." అని. ఇది కేవలం మూర్ఖత్వం క్రిందికి వస్తుంది. మీరు నేర్చేసుకుని సంస్కృతం వేదాలూ చదివేస్తే వేంఠనే చచ్చినట్లు అర్ధమైపోతాయా? ఎంత అజ్ఞానం. ఇలా అహంకారంతో మాట్లాడే వాళ్ళు వేదాలటుంచి దేన్నీ సరిగా అర్ధంచేసుకుందుకు తగిన మనఃస్థతిలోఉన్నారని నమ్మటం కష్టం.

    ముందు ఈపద్యం అర్ధం చేసుకుందుకు ప్రయత్నం చేయండి:

    విద్య యొసగును వినయంబు
    వినయంబునను బడయు పాత్రత
    పాత్రత వలని ధనంబు దానివలన
    ఐహికా ముష్మిక సుఖంబు లందు నరుడు.

    వినయం అలవరచుకుంటేనే విద్యకు సార్ధకత.

    ReplyDelete
  62. అదేదో సినిమాలో విలన్ కూడా ఇదే నిజం చెపుతాడు. "కులం కోసమైతేనేం, మతం కోసమైతేనేం, భాష కోసమైతేనం, వాళ్ళు కొట్టుకోవడానికి ఆయుధాలు నేను అమ్ముతాను. మనవాళ్ళు అలా కొట్టుకోబట్టే బ్రిటిష్‌వాళ్ళు వచ్చి దేశాన్ని సులభంగా ఆక్రమించుకోగలిగారు" అని. మత గ్రంథాలలో వ్రాసినవాటిని నిజ జీవితంలో ఆచరించినా మనవాళ్ళకి నిజాయితీ ఉందనుకోవచ్చు కానీ మనవాళ్ళకి మతం పేరుతో పాకిస్తాన్ మీద పడి ఏడవడం, నాస్తికులని తిట్టడం తప్ప ఏదీ రాదు. అందుకే నేను మతాన్ని విడిచి మతంతో సంబంధం లేకుండా బతుకుతున్నాను.

    ReplyDelete
  63. Jagadeesh jee.

    Good that you have deleted the nasty comments by both the parties. Henceforth, please keep the moderation and filter the filth.

    People who claim to have read all Religious Scriptures cannot even in their wildest dreams cannot stoop so low to speak the language used in the comments. Claiming to have read the Scriptures will not automatically get the respect for such person. If at all any such reading is done, it should be done with required understanding of the ideals preached in the Scriptures. Mere reading by rote will never help any person.

    Very unfortunate incident and that too strangely the comments do not in any way relate to the article written by you.

    We cannot wish away some mentally deranged people and therefore better to maintain a fence around our blogs with the wonderful facility of moderation. Please do that.

    ReplyDelete
  64. Very Very Good Jagadesh Ji. You have put moderation. Well done.

    ReplyDelete
  65. మంచి టపా..! డిస్కషన్‌ జరిగిందిక్కడ (తిట్లని పక్కన పెడితే)
    వైదిక విజ్ఞానంలో సైన్స్‌ ఉందని, ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరమేంటో నాకస్సలు అర్థం కాదు. సైన్స్‌ లేనిదెక్కడ..? భగవంతుడు, సైన్స్‌ (జ్ఞానం) వేర్వేరు కావనే కదా పెద్దలందరూ చెప్పేది. వేరు అనుకునేవాళ్లు నిజంగానే అజ్ఞానులు..! (కనీసం నా దృష్టిలో)

    "పాఠకులు" గురించి శ్యామలీయం గారి వివరణ చాలా బాగుంది.

    ReplyDelete
  66. @ వామన గీత గారు... మీరు చెప్పింది నిజమే... వైదిక మతంలో సైన్స్ వేరు, భగవంతుడు వేరు కాదు... కాని మన వాళ్ళు కూడా ఇతర మతాల మత్తులో పడి వారి ప్రకారమే ఆలోచిస్తూ, మన సంస్కృతిని మర్చిపోతున్నారు. అలాంటి వారి కోసమే ఈ టపా..

    ReplyDelete
  67. వేదాలు వ్రాసినదే మూడు వేల సంవత్సరాల క్రిందట. మీరు చెప్పింది నిజమైతే అప్పుడే విమానాలు ఎందుకు తయారు చెయ్యలేదు? పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. అన్నీ మన వేదాలలోనే ఉన్నాయనుకుంటే పరిశోధనలు ఎందుకు? వేదాలే చదివి కాపీ కొట్టొచ్చు కదా. విశాఖపట్నంలో పొట్లూరి దేవ సుందరరావు అనే పాస్టర్ కూడా ఇలాగే సైంటిస్టులు ఏది కనిపెట్టినా దాని గురించి బైబిల్‌లో ఎప్పుడో వ్రాసారని డబ్బా కొట్టుకుంటుంటాడు. అతనికి ఓ పత్రిక ఉంది. ఆ పత్రిక పేరు "భూతలక్రిందులు". ఆ పత్రికలోని వ్రాతలు కూడా పత్రిక టైటిల్‌కి తగినట్టుగానే ఉంటాయి.

    ReplyDelete
  68. "మానవ నాగరికతకు మూల స్థంభమే వేదం. మనకి జన్మ నిచ్చిన స్త్రీని మాతృ మూర్తిగా పిలవాలని ప్రపంచానికి నేర్పింది వేదం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి నాగరికత నేర్పింది వేదం. వేదం అంటే జ్ఞానం - జ్ఞానం అంటే వేదం. "

    Well said. No sensible human would deny this.

    ReplyDelete
  69. @ ప్రవీణ్ గారు... వేదాలని మూడు వేల సంవత్సరాల క్రితమే వ్రాసారని మీకెవరయినా చెప్పారా? లేక మీరేమయినా పరిశోధన చేసి కనిపెట్టారా? కళ్ళ ముందు కనపడే రుజువుల్ని చూడకుండా ఎవడో చెప్పింది నిజమని నమ్మితే నేనేమీ చెయ్యలేను. మహాభారత యుద్ధమే 5000 సంవత్సరాల క్రితం జరిగిందని అందరూ ఒప్పుకున్న సత్యం. (సుమారు క్రీ.పూ. 3000). అంతకు ముందు రామాయణం, దానికన్నా ముందు వేద కాలం. అంటే కనీసం పది వేల సంవత్సరాల పైనే ఉండొచ్చు. ఇక విమానాల సంగతంటారా, మీరు రామాయణ, మహాభారతాలు చదివానన్నారుగా? ఎన్ని వందల సార్లు విమానాల ప్రస్తావన వచ్చిందో చదవలేదా? వాల్మీకి రామాయణంలో పుష్పక విమానం ఎలా పనిచేసేదో చాలా చక్కటి వర్ణన ఇచ్చాడు. కనీసం అదయినా చదవండి....

    ReplyDelete
  70. @ ప్రవీణ్ గారు... మీరి ప్రతీదీ ఇతరమ మత గ్రంధాల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది... దయచేసి వారితో వైదిక మతాన్ని పోల్చకండి... "సర్వేత్ర సుఖినస్సంతు, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు" అన్న వేదాలకి, నీ దేవుడిని పూజించక పోతే నీ కన్న పిల్లల్ని, ప్రాణ స్నేహితుడిని కూడా రాళ్ళతో కొట్టి చంపమన్న మిగతా మతాలకి నా దృష్టిలో పోలిక అర్ధ రహితం.

    ReplyDelete
  71. http://endukoemo.blogspot.com/2011/12/alchemist.html

    check the above link to know about "purusavedi"

    Somebody suggested to some one.

    Coming to my opinion no comments up to now from my side.

    ?!

    ReplyDelete
  72. జగదీష్ గారు,
    చక్కటి విషయాన్ని చక్కగా వివరించారు.ధన్యవాదాలు. తర్వాతి భాగం కోసం ఎదురు చూస్తాము.

    ReplyDelete
  73. జగదీశ్‌ గారు
    ఇక్కడ జరిగేదంతా ఒక స్టేజ్‌ డ్రామా .. కొంత మంది ఆధిపత్యాన్ని నెలెబెట్టుకోవడానికి ఇలాంటి చర్చలెక్కడన్నా జరుగుతుంటే ఒక గూగుల్‌ గుంపులోకి పోయి పదిమందిని వెంటేసుకుని అగ్లీ కామెంట్లు రాయడానికి వస్తారు. ఇక్కడ ఉన్న 100 కామెంట్లు మీరు లేవదీసిన అంశాలమీద నిబద్ధతో వచ్చాయనుకుంటున్నారా? కాదు, కేవలం ఒక ప్రబుద్ధుడు ఒక గూగుల్‌ గుంపులో ఇక్కడకి వచ్చి నానా చండాలం చేయమని పిలిస్తే పిలుపునందుకుని వచ్చారు. పైన పైన ఉన్న పెద్ద పేర్లు కూడా ఈ పిలుపుని అందుకుని వచ్చినవే.

    ఇవన్నీ చూస్తే రజనీకాంత్‌ డైలగు ఒకటి గుర్తు వస్తుంది "నాన్నా XXX గుంపుగా వస్తాయి, సింహం సింహం ఎప్పుడూ ఒకటిగా పోరాడుతుంది,

    ReplyDelete
  74. Personally I feel, our vedas have some pristine thoughts, philosophy and spiritual enquiry.
    They are our vedas. So we should love them. But our self love should not make us claim what is not there.
    If vedas might have had some thought/theory about aeroplanes and cosmology (eg:Theory of relativity). But I do not think they(aeroplanes, nueclear bombs etc) were manufactured in those times. In fact, Hindustan Aeronautics Limited (HAL) Bangalore has tried to manufacture according to the design of Vimana Sastra. But it was a failure(see wiki abt this). If aeroplanes were there thousands of years back, we should get their remains in archeological excavations at Madhura, Kurukshetra and so on. But, alas that's not the case.
    The mentioin of vimanas in puranas may be a thing of imagination(But that isself is not a mean achievement). A research on Kamasutra showed that many postures in it were not possible, they were simply fancies of the author.

    ReplyDelete
  75. Hindu mathanlo unna devvullu,devathalaku chala buthu charithra tho nimpabadindi. Valla meeda ee nati manavulu chala better.devullu devathalu padi mandiki manchi cheppali kani valle vepareetha asleelatha jarigisthunte eka manushulake emi cheptharu?

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.