Pages

Monday, January 26, 2009

మనుషులు గర్జిస్తారా? మాట్లాడతారా?

సాధారణంగా మనుషులందరూ ఏదో ఒక భాష మాట్లాడుతుంటారని తెలుసు. జంతువులయితే, ఆయా జాతుల స్వభావాన్ని బట్టి వాటి భాషకి ఒకో పేరు పెట్టడం జరిగింది. అంతవరకు ఓ.కే. కానీ ఈ మధ్యన ఏ పేపర్ చదివినా, ఏ టి.వి చూసినా, ఒకతే గర్జన, ఘీంకారాలు కనిపిస్తున్నాయి. కొన్నాళ్ళ పాటు యువ గర్జన గురించి విన్నాము. బహుశా యువకులందరూ మాట్లాడ్డం మానేసి, గర్జిస్తున్నారేమో అనుకున్నాను. తరువాత కొన్నళ్ళకి మాల గర్జన, మాదిగ గర్జన, వెలమ గర్జన, కమ్మ గర్జన అంటూ అన్ని గర్జనలు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా మహిళా గర్జన కూడా త్వరలో నిర్వహిస్తామని ఒక రాజకీయ పార్టీ వారు ప్రకటించారు. నాకు తెలిసినంత వరకు సింహాలు మాత్రమే గర్జిస్తాయి. మరి ఈ మనుషులు గర్జించడమేమిటో. హాయిగా మనుషులందరూ కూర్చుని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి కదా. రాజకీయ పార్టిలకి ప్రజల సమస్యల మీద ఎటువంటి చిత్తశుద్ది లేనంత కాలం, జనాలకి గేలం వేసే ఇటువంటి చౌకబారు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే వుంటాయి. నిజంగా ప్రజలకి మేలు చేసే ఏ నాయకుడిని గాని, రాజకీయ పార్టీని గాని జనం ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. అటువంటి వారు ఎటువంతి గర్జనలూ చెయ్యనక్కరలేదు. హాయిగా మాట్లాడితే చాలు, జనం అర్ధం చేసుకుంటారు. అందరూ ఈ విషయం గుర్తెరిగి ఇకపై హాయిగా మాట్లాడుకుంటారని ఆశిస్తూ, అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.