కరోనా కాలంలో ‘ఆహా’ ఒ.టి.టి.లో రిలీజైన ఒక చక్కటి మూవీ ‘ప్లే బ్యాక్’. సాధారణంగా తెలుగు సినిమాలలో ఉండే 3 ఫైట్లు, 6 పాటలు అనే రొటీన్కి భిన్నంగా చక్కటి కథతో, మరింత చక్కటి స్క్రీన్ప్లేతో ఈ మూవీని తీసారు. ఈ మూవీ కథ కూడా మన ఊహకి అందకుండా ఉంటుంది. ఇటువంటి భిన్నమైన జోనర్లో సినిమా చూసిన తరువాత తెలుగు సినిమాకు కూడా మంచి రోజులు వస్తున్నాయి అనిపిస్తుంది. ఎటువంటి హడావుడి లేకుండా, ఊకదంపుడు ఉపన్యాసాలు, పెద్దపెద్ద డైలాగులు, భారీ సెట్టింగులు... ఇటువంటి హడావుడి ఏదీ లేకుండా, కేవలం కథతోనే కట్టిపడేసాడు దర్శకుడు హరిప్రసాద్. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే టైమ్ ట్రావెల్, టైమ్ మెషీన్ వంటి కాన్సెప్ట్లతో తెలుగులో కూడా చాలా మూవీస్ వచ్చాయి. ఆదిత్య 369, 24 వంటి మూవీస్లో టైమ్ ట్రావెల్ గురించి తెలుసుకున్నాం. కాని, గతాన్ని, వర్తమానాన్ని కలుపుతూ టైమ్, స్పేస్ కంటిన్యూయమ్లో ఒక చిన్న క్రాక్
ఏర్పడి, అప్పటి వారితో ఇప్పటి వారికి కమ్యూనికేషన్ ఏర్పడితే ఏమవుతుందో అనే ఒక సరికొత్త కాన్సెప్ట్తో ఈ మూవీ తీసాడు దర్శకుడు.
ఇప్పటి వరకు నేను తెలుగు మూవీస్కి రివ్యూలు రాయలేదు. నేను తెలుగు సినిమాలు చూడడమే తక్కువ. ఒక వేళ చూసినా, రివ్యూ రాయవలసినంత కంటెంట్ ఉన్న చిత్రాలు ఇప్పటి వరకు నేను చూడలేదు... బహుశా తీయలేదు. కాని ఈ మూవీ చూసిన తరువాత, ఇటువంటి మంచి మూవీని, మంచి అభిరుచి ఉన్న వారు ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అనిపించింది.
కథ విషయానికి వస్తే, 1993లో ఉన్న యువతికి, ప్రస్తుతం 2020లో ఉన్న యువకుడికి మధ్య ఒక పాత టెలిఫోన్ ద్వారా కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. అంటే టైమ్ లైన్లో గతంలో ఉండే వ్యక్తులు, ప్రస్తుతం ఉన్న వారు మాట్లాడుకోగలుగుతారు. నిజానికి గతంలో ఉండే యువతి ప్రస్తుతం చనిపోయి ఉంటుంది. కాని, ప్రస్తుతం ఉన్న యువకుడు ఆ విషయం తెలుసుకుని, గతంలో ఉన్న యువతికి సహాయం చేసి, ఏ విధంగా తన ప్రాణాలు కాపాడాడు అన్నది సినిమా కథాంశం. ఆ యువతికి, తన ప్రాణాలు కాపాడిన యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయం మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఇవన్నీ చెబితే సినిమాలో థ్రిల్ ఉండదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది అమ్మ సెంటిమెంట్. అమ్మ ప్రాణం కాపాడుకోవడం కోసం కొడుకు ఎంత రిస్క్ చేసాడు అనేది కూడా అంతర్లీనంగా చాలా బాగా చూపించారు.
కథ, స్క్రీన్ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా సఫలమయ్యాడు. చక్కటి ప్రెజెంటేషన్ చేసాడు. ఎక్కడా ఎటువంటి తికమక లేకుండా గతానికి, వర్తమానానికి మధ్య తేడాని చూపిస్తూ, సాధారణ ప్రేక్షకుడికి కూడా కష్టమైన ఫిజిక్స్ సూత్రాలని అర్ధమయ్యేలా చేయడంలో విజయం సాధించాడు. నటీనటుల్లో ‘వకీల్సాబ్’లో నటించిన అనన్య చాలా చక్కటి అభినయం కనబరిచింది. 1993 నాటి ఆమ్మాయిలు ఎంత అమాయకంగా ఉండేవారో అంతే అమాయకంగా నటించింది. నటనా పరంగా తనకి చక్కటి భవిష్యత్తు ఉంది అనిపించేలా చేసింది. మిగిలిన నటీనటులు తమ పరిధిలో చక్కగా నటించారు. కెమెరా పనితనం కూడా చాలా బాగా కుదిరింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి హైలైట్ గా ఉంది. మంచి అభిరుచి గల ప్రేక్షకులు తప్పని సరిగా చూడతగిన సినిమా ఇది. తెలుగు సినిమాని ఒక స్థాయికి తీసుకువెళ్ళిన మూవీగా ఈ ‘ప్లే బ్యాక్’ ప్రేక్షకులకి ఎప్పుడూ గుర్తుండి పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Showing posts with label సినిమాలు. Show all posts
Showing posts with label సినిమాలు. Show all posts
Thursday, June 10, 2021
ప్లే బ్యాక్ మూవీ రివ్యూ
Sunday, May 29, 2016
బైబిల్ కాలం నాటి దేవుడిని చంపేసిన హాలీవుడ్.... ఎక్స్మెన్ మూవీ విశ్లేషణ
హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా వాస్తవిక ఆలోచనల మీద ఆధారపడుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో విడుదలయిన 'ఎక్సోడస్' బైబిల్లోని నిర్గమ కాండను బేస్ చేసుకుని తీసిన సినిమా. అయినప్పటికీ ఎక్కడా మహిమలు, మహత్యాల జోలికి పోకుండా ఉన్నదున్నట్టుగా తీసారు. ఎక్స్మెన్ అపోకలిప్స్ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. ఇంతకు ముందు ఈ సిరీస్లోని సినిమాల్లో లాగానే జన్యుపరంగా మార్పు పొందిన మనుష్యులు తమకున్న అతీత శక్తుల ద్వారా మానవాళికి మేలు చేయడమే ముఖ్య కథాంశం. అయితే తమకున్న అపార శక్తుల్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుని, తాము మాత్రమే ప్రయోజనం పొందాలా లేదా సమస్త మానవాళికోసం పోరాడి, తమ శక్తులకు ఒక సార్థకత చేకూర్చుకోవాలా అనే పాయింట్ చుట్టూ కధ తిరుగుతుంటుంది.
ప్రస్తుత సినిమా విషయానికొస్తే, అపోకలిప్స్ అనేది బైబిల్ చేత నిషేధితమైన పుస్తకాల సంకలనం. అంటే క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న పుస్తకాలన్నిటినీ ఆకాలం నాటి చర్చి గంపగుత్తగా నిషేధించి వాటిని సైతాను వ్రాతలుగా నిర్ధారించింది. అలా 3500 సంవత్సరాల క్రితం బైబిల్ (అపోకలిప్స్) లో వర్ణించబడిన ఒక దేవుడు ఈజిప్ట్ను కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలిస్తుంటాడు. తనకున్న అతీంద్రియ శక్తుల సాయంతో మనుష్యులను బానిసలుగా చేస్తాడు. తన మాట వినని వారికి ఒకటే శిక్ష.. అదే మరణం. తనకు ఎదురు చెప్పిన ప్రజలుండే నగరాల్ని, దేశాల్ని కూడా వదలడు. వాటిలో ఎన్నో ప్రకృతి విలయాల్ని సృష్టించి, అక్కడున్న ప్రజలందరినీ మృత్యు వాతకు గురిచేస్తాడు. ఆ దేవుడికి తెలిసిన ఒకే ఒక పరిపాలనా విధానం... భయ పెట్టి దారిలోకి తెచ్చుకోవడం. అయితే, అతని దుర్మార్గాన్ని సహించలేని అప్పటి ప్రజల్లో కొందరు తిరుగుబాటు చేసి, ఆ దేవుడిని చంపడానికి ప్రయత్నిస్తారు. కాని అనుకోని విధంగా అతడు కోమాలోకి వెళ్ళిపోతాడు. తిరిగి 1983లో కొందరు ఆ దేవుడిని మరలా ఈ లోకంలోకి తీసుకువస్తారు. స్పృహలోకి వచ్చిన ఆ దేవుడికి ఈ లోకం తీరు నచ్చదు. మరలా ఈ భూమిని తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకోవాలని మరికొందరు ఎక్స్మెన్లను తన వైపు తిప్పుకుని, ప్రళయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. కాని, ఎక్స్మెన్లు తమ తప్పుని తెలుసుకుని, ఆ దేవుడిని చంపి, మానవాళిని ప్రళయం నుండి కాపాడుతారు. ఇదీ స్థూలంగా కథ.
దేవుడికి చంపడమనే భావన భారతీయులకి కొత్తగా అనిపించవచ్చు. కాని, పాశ్చాత్య కోణం నుండి ఆలోచిస్తే, వారి బాధ మనకు అర్థం అవుతుంది. హిందువుల ఆలోచన ప్రకారం దేవుడికి రూపం లేదు, ఆయన సర్వాంతర్యామి, ఇంకా చెప్పాలంటే సృష్టిలోని ప్రతి అణువులోను ఆయనే నిండి వున్నాడు. ఆయనలోనే ఈ సమస్త సృష్టి ఇమిడి ఉంది. అణువు నుండి బ్రహ్మాండం వరకు అంతటా భగవంతుడే నిండి ఉన్నాడు. దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతమయిపోతుంది. కాని పాశ్చాత్య మతాల దృష్టిలో దేవుడు కూడా ఒక భౌతిక రూపమే. ఆయన స్వర్గం అనే ఒక 'ప్రదేశం'లో బంగారు సింహాసనంపై కూర్చుని ఉంటాడు. అక్కడి నుండి ఈ లోకాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడూ ఈ భూమిమీదకి వచ్చి పోతూ ఉంటాడు. తన మాట వివని వారిని బాధలకు గురి చేస్తూ ఉంటాడు. ఒక వేళ ఇప్పుడు తప్పించుకున్నా, తన స్వర్గం పక్కనే ఒక నరకాన్ని కూడా సృష్టించి ఉంచుతాడు. ఎప్పటికీ ఆరని మంటలు అక్కడ ఉంటాయి. దానిలో పడేస్తాడు. అటువంటి సాడిస్ట్ దేవుడు ఇప్పటి ప్రపంచానికి అవసరంలేదు. ఒకవేళ పొరపాటున వచ్చి తమ మీద ఆధిపత్యం చెలాయించాలని చూసినా, ఇప్పటి మనుష్యులు ఊరుకోరు. తిరుగుబాటు చేస్తారు. అతడిని తన లోకానికి పంపేస్తారు. ఇదీ పాశ్చాత్య ప్రపంచం తీరు.
ఈ సినిమా చూసిన తరువాత నేను చాలా సేపు ఆలోచించాను. పాశ్చాత్య క్రైస్తవంలో వచ్చిన ఆలోచనలు చాలా విప్లవాత్మకమైనవి. బైబిల్ని ప్రస్తుత సమాజం అంగీకరించే దశలో లేదని అర్థమయింది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎటువంటి శాస్త్రీయ పరిజ్ఞానంలేని సమాజాల్లో నుండి ప్రపంచానికి అందివ్వబడిన దుర్మార్గమైన కానుక 'బైబిల్'. ప్రత్యేకించి ఓల్డ్ టెస్టిమెంట్ చదివితే చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. అన్నీ ఆటవిక ఆలోచనలు, అర్థం పర్థం లేని సంఘటనలతో కలగలిసిపోయి ఉంటుంది. రెండు ప్రపంచ యుద్దాలకి కారణమైనది కూడా ఆ పుస్తకమే. అటువంటి పుస్తకం మీద ఆ మతాన్ని అనుసరించే వారే తిరుగుబాటు చేయడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. దేవుడి కన్నా మానవత్వమే గొప్పదని, మానవత్వానికి హాని కలిగించేలా ఉంటే దేవుడినయినా తిరస్కరించవచ్చును అనేది ఇప్పటి పాశ్చాత్య దృక్పధంగా మనం అర్థం చేసుకోవచ్చును. ఈ ఆలోచన భారతీయ తాత్విక చింతనకు దగ్గరగా ఉంటుంది. సర్వ ప్రాణుల్లోను భగవంతుని రూపాన్ని దర్శించమని భారతీయ సంప్రదాయం చెబుతుంది. కేవలం మానవ జాతి మాత్రమే కాక, పక్షులు, జంతువులు, జలచరాలు వంటి వాటిలో కూడా భగవంతుడు ఆవిర్భవిస్తాడు. అవసరాన్నిబట్టి ఏ రూపంలోనైనా భగవంతుడు భూమి మీద అవతరిస్తాడనేది మన సిద్ధాంతం. దశావతారాలు ఆ కోవలోకి చెందినవే. ''ఈ సమస్త ప్రకృతిని మానవుడు వాడుకోవడం కోసమే దేవుడు సృష్టించాడు'' అనే బైబిల్ మాటలు మన ఆలోచనకి పూర్తి విరుద్ధంగా అనిపిస్తాయి. ఎంత గొప్ప మతమైనా, ఎన్ని మహిమలున్న దేవుడైనా, మానవత్వాన్ని మరచిపోతే, మనం ఉనికికి కారణమైన ఈ ప్రకృతిని గౌరవించకపోతే నామరూపాల్లేకుండా చరిత్రలో కలిసిపోవడం ఖాయమనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది.
ప్రస్తుత సినిమా విషయానికొస్తే, అపోకలిప్స్ అనేది బైబిల్ చేత నిషేధితమైన పుస్తకాల సంకలనం. అంటే క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న పుస్తకాలన్నిటినీ ఆకాలం నాటి చర్చి గంపగుత్తగా నిషేధించి వాటిని సైతాను వ్రాతలుగా నిర్ధారించింది. అలా 3500 సంవత్సరాల క్రితం బైబిల్ (అపోకలిప్స్) లో వర్ణించబడిన ఒక దేవుడు ఈజిప్ట్ను కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలిస్తుంటాడు. తనకున్న అతీంద్రియ శక్తుల సాయంతో మనుష్యులను బానిసలుగా చేస్తాడు. తన మాట వినని వారికి ఒకటే శిక్ష.. అదే మరణం. తనకు ఎదురు చెప్పిన ప్రజలుండే నగరాల్ని, దేశాల్ని కూడా వదలడు. వాటిలో ఎన్నో ప్రకృతి విలయాల్ని సృష్టించి, అక్కడున్న ప్రజలందరినీ మృత్యు వాతకు గురిచేస్తాడు. ఆ దేవుడికి తెలిసిన ఒకే ఒక పరిపాలనా విధానం... భయ పెట్టి దారిలోకి తెచ్చుకోవడం. అయితే, అతని దుర్మార్గాన్ని సహించలేని అప్పటి ప్రజల్లో కొందరు తిరుగుబాటు చేసి, ఆ దేవుడిని చంపడానికి ప్రయత్నిస్తారు. కాని అనుకోని విధంగా అతడు కోమాలోకి వెళ్ళిపోతాడు. తిరిగి 1983లో కొందరు ఆ దేవుడిని మరలా ఈ లోకంలోకి తీసుకువస్తారు. స్పృహలోకి వచ్చిన ఆ దేవుడికి ఈ లోకం తీరు నచ్చదు. మరలా ఈ భూమిని తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకోవాలని మరికొందరు ఎక్స్మెన్లను తన వైపు తిప్పుకుని, ప్రళయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. కాని, ఎక్స్మెన్లు తమ తప్పుని తెలుసుకుని, ఆ దేవుడిని చంపి, మానవాళిని ప్రళయం నుండి కాపాడుతారు. ఇదీ స్థూలంగా కథ.
దేవుడికి చంపడమనే భావన భారతీయులకి కొత్తగా అనిపించవచ్చు. కాని, పాశ్చాత్య కోణం నుండి ఆలోచిస్తే, వారి బాధ మనకు అర్థం అవుతుంది. హిందువుల ఆలోచన ప్రకారం దేవుడికి రూపం లేదు, ఆయన సర్వాంతర్యామి, ఇంకా చెప్పాలంటే సృష్టిలోని ప్రతి అణువులోను ఆయనే నిండి వున్నాడు. ఆయనలోనే ఈ సమస్త సృష్టి ఇమిడి ఉంది. అణువు నుండి బ్రహ్మాండం వరకు అంతటా భగవంతుడే నిండి ఉన్నాడు. దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతమయిపోతుంది. కాని పాశ్చాత్య మతాల దృష్టిలో దేవుడు కూడా ఒక భౌతిక రూపమే. ఆయన స్వర్గం అనే ఒక 'ప్రదేశం'లో బంగారు సింహాసనంపై కూర్చుని ఉంటాడు. అక్కడి నుండి ఈ లోకాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడూ ఈ భూమిమీదకి వచ్చి పోతూ ఉంటాడు. తన మాట వివని వారిని బాధలకు గురి చేస్తూ ఉంటాడు. ఒక వేళ ఇప్పుడు తప్పించుకున్నా, తన స్వర్గం పక్కనే ఒక నరకాన్ని కూడా సృష్టించి ఉంచుతాడు. ఎప్పటికీ ఆరని మంటలు అక్కడ ఉంటాయి. దానిలో పడేస్తాడు. అటువంటి సాడిస్ట్ దేవుడు ఇప్పటి ప్రపంచానికి అవసరంలేదు. ఒకవేళ పొరపాటున వచ్చి తమ మీద ఆధిపత్యం చెలాయించాలని చూసినా, ఇప్పటి మనుష్యులు ఊరుకోరు. తిరుగుబాటు చేస్తారు. అతడిని తన లోకానికి పంపేస్తారు. ఇదీ పాశ్చాత్య ప్రపంచం తీరు.
ఈ సినిమా చూసిన తరువాత నేను చాలా సేపు ఆలోచించాను. పాశ్చాత్య క్రైస్తవంలో వచ్చిన ఆలోచనలు చాలా విప్లవాత్మకమైనవి. బైబిల్ని ప్రస్తుత సమాజం అంగీకరించే దశలో లేదని అర్థమయింది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎటువంటి శాస్త్రీయ పరిజ్ఞానంలేని సమాజాల్లో నుండి ప్రపంచానికి అందివ్వబడిన దుర్మార్గమైన కానుక 'బైబిల్'. ప్రత్యేకించి ఓల్డ్ టెస్టిమెంట్ చదివితే చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. అన్నీ ఆటవిక ఆలోచనలు, అర్థం పర్థం లేని సంఘటనలతో కలగలిసిపోయి ఉంటుంది. రెండు ప్రపంచ యుద్దాలకి కారణమైనది కూడా ఆ పుస్తకమే. అటువంటి పుస్తకం మీద ఆ మతాన్ని అనుసరించే వారే తిరుగుబాటు చేయడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. దేవుడి కన్నా మానవత్వమే గొప్పదని, మానవత్వానికి హాని కలిగించేలా ఉంటే దేవుడినయినా తిరస్కరించవచ్చును అనేది ఇప్పటి పాశ్చాత్య దృక్పధంగా మనం అర్థం చేసుకోవచ్చును. ఈ ఆలోచన భారతీయ తాత్విక చింతనకు దగ్గరగా ఉంటుంది. సర్వ ప్రాణుల్లోను భగవంతుని రూపాన్ని దర్శించమని భారతీయ సంప్రదాయం చెబుతుంది. కేవలం మానవ జాతి మాత్రమే కాక, పక్షులు, జంతువులు, జలచరాలు వంటి వాటిలో కూడా భగవంతుడు ఆవిర్భవిస్తాడు. అవసరాన్నిబట్టి ఏ రూపంలోనైనా భగవంతుడు భూమి మీద అవతరిస్తాడనేది మన సిద్ధాంతం. దశావతారాలు ఆ కోవలోకి చెందినవే. ''ఈ సమస్త ప్రకృతిని మానవుడు వాడుకోవడం కోసమే దేవుడు సృష్టించాడు'' అనే బైబిల్ మాటలు మన ఆలోచనకి పూర్తి విరుద్ధంగా అనిపిస్తాయి. ఎంత గొప్ప మతమైనా, ఎన్ని మహిమలున్న దేవుడైనా, మానవత్వాన్ని మరచిపోతే, మనం ఉనికికి కారణమైన ఈ ప్రకృతిని గౌరవించకపోతే నామరూపాల్లేకుండా చరిత్రలో కలిసిపోవడం ఖాయమనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది.
Sunday, November 14, 2010
ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన 'స్కైలైన్ (విధ్వంసం)'
హాలీవుడ్ సినిమాలంటే ప్రత్యేకించి స్పెషల్ ఎఫెక్టుల కోసమే థియేటర్కు వెళ్ళి మరీ సినిమా చూస్తుంటారు. వాల్ పోస్టర్స్ చూసి దారుణంగా మోసపోయిన సినిమా 'స్కెలైన్'. హాలీవుడ్లో సినిమాలను ఇంత దారుణంగా, దరిద్రంగా తీస్తారా అనిపించింది. ఎప్పుడు థియేటర్ నుండి బయటకు పారిపోయి వచ్చేద్దామా అనిపించింది. దాన్ని రిలీజ్ చేసింది కూడా రిలయన్స్ బిగ్ పిక్చర్. కేవలం స్పెషల్ ఎఫెక్టుల్ని మాత్రమే నమ్ముకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా మొత్తాన్ని కేవలం ఐదుగురు ఆర్టిస్టులతో తీసారు. అదీ ఒక చిన్న అపార్ట్మెంట్లో. ట్రైలర్స్లో, వాల్పోస్టర్స్లో చూపించే కాస్త ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే సినిమా మొత్తం కొన్ని పదుల సార్లు రిపీట్ చేసారు. లాస్ఏంజిల్స్ నగరంగాని, అలియన్స్తో ఫైట్ చేయడానికి వచ్చిన ఫ్లైట్లుగాని అన్నీ కంప్యూటర్ మీద చేసినవే.
స్టోరీ లైన్: చెప్పడానికి ఏమీ లేదు.
స్పెషల్ ఎఫెక్ట్స్: ఒకే ఎఫెక్ట్ని పదిసార్లు రిపీట్ చేసారు
డైరెక్షన్: తీసునోడికే తెలిసుండదు.
చూసినోళ్ళ పరిస్థితి: వెళ్ళేపుడు జండూ బామ్ కొనుక్కోవడమే.
నాలాగా ఇంకెవ్వరూ బాధ పడకూడదని, డబ్బులు పాడుచేసుకోకూడదని ఈ చిన్న రివ్యూ పెట్టారు. దీన్ని టైప్ చేయడానికి నేను తీసుకున్న టైమ్ కూడా వృధా..
స్టోరీ లైన్: చెప్పడానికి ఏమీ లేదు.
స్పెషల్ ఎఫెక్ట్స్: ఒకే ఎఫెక్ట్ని పదిసార్లు రిపీట్ చేసారు
డైరెక్షన్: తీసునోడికే తెలిసుండదు.
చూసినోళ్ళ పరిస్థితి: వెళ్ళేపుడు జండూ బామ్ కొనుక్కోవడమే.
నాలాగా ఇంకెవ్వరూ బాధ పడకూడదని, డబ్బులు పాడుచేసుకోకూడదని ఈ చిన్న రివ్యూ పెట్టారు. దీన్ని టైప్ చేయడానికి నేను తీసుకున్న టైమ్ కూడా వృధా..
Friday, November 13, 2009
ప్రపంచానికి ఆఖరు ఘడియలు... 2012 సినిమా రివ్యూ..

ఈ ప్రపంచానికి ఆఖరి రోజు వచ్చి, వినాశనం కళ్ళ ముందు జరుగుతూంటే, ఈ భూమి మీద మానవ జాతి అంతరించిపోతే, ఎలా వుంటుంది అనే అంశాలతో తీసిన చిత్రమే ఈ 2012. ఈ సినిమా దర్శకుడు రొనాల్డ్ ఎమ్రిక్ కి జనాలని భయపెట్టడం ఇదేమి కొత్త కాదు. ఇది వరకు ఇండిపెండెన్స్ డే, 10,000 బి.సి., డే ఆఫ్టర్ టుమారో వంటి సినిమాలలో తన ప్రతిభను చాటుకున్నాడు. వినాశనం, ప్రళయం వంటి సబ్జక్టులతో సినిమాలు రావడం హాలీవుడ్ లో కొత్త కాకపోయినా, 2012 లో నిజంగానే భూమి వినాశనం అవుతుందనే అంచనాలతో రూపొందించిన సినిమాగా అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.
సహజంగానే హాలీవుడ్ సినిమాలని ఇష్టపడే నేను, ఈ సినిమా చూడడానికి, అందునా ప్రపంచంలో అందరికన్నా ముందుగా (హాలీవుడ్లో ఈవాళ రిలీజ్ అవుతుంది) చూడడం థ్రిల్లింగ్గా వుండి నిన్న సాయంత్రమే థియేటర్కి వెళ్ళాను. మన దేశ ప్రేక్షకులని ఆకర్షించడానికి కాబోలు, ఈ సినిమా ముందుగా ఇండియాలో ప్రారంభమవుతుంది. సూర్యుడిలో జరిగే విస్ఫోటనాల కారణంగా (Solar flares) న్యూట్రినోలు విడుదలయి, అవి మైక్రోవేవ్స్లా పనిచేసి, భూమిలోపలి లావాని ఉడికించడం, దాని వలన విపరీతమయిన వేడి విడుదలయ్యి, భూమి పై పొరలు కంపించి, అగ్ని పర్వతాలు, భూకంపాలు, సునామీలు వచ్చి భూమి యొక్క ధృవాలు మారిపోయి, ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యి, మానవ జాతి వునికే లేకుండా పోతుందనేది ఒక సిద్దాంతం. దీనికి తోడు, మెక్సికోలోని ఒక పురాతనమయిన మాయన్ తెగవారు కొన్ని వేల సంవత్సరాల క్రితం రూపొందించుకున్న కేలండర్ సరిగ్గా 2012 డిసెంబర్ 21 నాటికి పూర్తవుతుంది. అంటే ఆ తేదీ తరువాత కేలండర్తో పని వుండదనేది మాయన్ల నమ్మకంగా చెబుతారు. ఇవన్నీ కలగలిపి, ఒక వేళ నిజంగా ఇలా జరిగితే ఎలా వుంటుందనేది మనకి రుచి చూపించడానికి, ఎమ్రిక్ చక్కటి ప్రయత్నం చేసాడు.
ఈ సినిమాలో హీరో జాక్సన్కి అందరికన్నా ముందుగా భూమి వినాశనం గురించి తెలుస్తుంది. వెంటనే అతను తన కుటుంబాన్ని, ఇద్దరు పిల్లల్నీ రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఉత్కంఠని రేకెత్తిస్తాయి. తన కారులో పిల్లల్ని తీసుకు వెళుతూ ఉంటే వెనకాలే భూమి విడిపోవడం, విమానంలో వెళుతుంటే, కళ్ళ ఎదురుగా పెద్ద భవనాలు, ఫ్లై ఓవర్లు కూలిపోవడం వంటివి కంపూటర్ గ్రాఫిక్స్ సహాయంతో ఎంతో అద్బుతంగా తెరకెక్కించారు. భూమి మీద వున్న నాగరికత మనుషులూ అందరూ అంతరించిపోయాక, మరలా కొత్త జీవితం మొదలు పెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పెద్ద పెద్ద షిప్స్ నిర్మించడం, ప్రపంచంలోని అన్ని రంగాలకి చెందిన శాస్త్రవేత్తలని, దేశాధినేతలని, కోటీశ్వరుల్ని ఆ షిప్స్ ద్వారా రక్షించడం వంటి దృశ్యాలు కేవలం ధియేటర్లో మాత్రమే చూడ వలసినవి. కొద్ది సేపటిలో అందరూ చనిపోతామనే భావన వచ్చినపుడు మనుషుల మధ్య సంబందాలు ఎలా వుంటాయి, వారి మానసిక స్తితి ఎలా వుంటుంది, తమ పిల్లల్ని కాపాడడానికి తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు వంటివి, మానవీయ విలువల్ని కొత్త కోణంలో చూపిస్తాయి. కేవలం గ్రాఫిక్స్ గురించి మాత్రమే కాకుండా చక్కటి విలువలున్న చిత్రంగా కూడా ఈ సినిమా నాకు నచ్చింది.
అమెరికన్ ప్రెసిడెంట్గా ఒబామా స్తానంలో ఒక నల్ల జాతీయుడిని వుంచడం, ఒబామా లాగే తన ప్రజల గురించి అతడు ఆలోచించడం వంటివి ఆలోచింపచేస్తాయి. అమెరికన్ ప్రెసిడెంట్ని ప్రళయం నుంచి రక్షించడం కోసం ప్రత్యేకమయిన ఏర్పాట్లు చేసినా కూడా వాటిని కాదనుకుని, తాను మరణంలోనయినా తన ప్రజలతోనే వుంటానని చెప్పి, చివరకు వారితోనే జలసమాధి కావడం వంటి సంఘటనలని చాలా చక్కగా చిత్రీకరించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే సినిమా చూస్తున్న థ్రిల్ వుండదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను.
నిజంగా 2012లో ప్రళయం వస్తుందా, రాదా అన్న విషయాన్ని పక్కన పెడితే, కుటుంబ సమేతంగా చూడదగిన చక్కటి సినిమా ఇది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా వున్న ఈ సినిమాని DVD వచ్చే వరకు వెయిట్ చేసేకన్నా, థియేటర్లో చూస్తేనే ఎక్కువ ఎంజాయ్ చేయగలం.
సహజంగానే హాలీవుడ్ సినిమాలని ఇష్టపడే నేను, ఈ సినిమా చూడడానికి, అందునా ప్రపంచంలో అందరికన్నా ముందుగా (హాలీవుడ్లో ఈవాళ రిలీజ్ అవుతుంది) చూడడం థ్రిల్లింగ్గా వుండి నిన్న సాయంత్రమే థియేటర్కి వెళ్ళాను. మన దేశ ప్రేక్షకులని ఆకర్షించడానికి కాబోలు, ఈ సినిమా ముందుగా ఇండియాలో ప్రారంభమవుతుంది. సూర్యుడిలో జరిగే విస్ఫోటనాల కారణంగా (Solar flares) న్యూట్రినోలు విడుదలయి, అవి మైక్రోవేవ్స్లా పనిచేసి, భూమిలోపలి లావాని ఉడికించడం, దాని వలన విపరీతమయిన వేడి విడుదలయ్యి, భూమి పై పొరలు కంపించి, అగ్ని పర్వతాలు, భూకంపాలు, సునామీలు వచ్చి భూమి యొక్క ధృవాలు మారిపోయి, ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యి, మానవ జాతి వునికే లేకుండా పోతుందనేది ఒక సిద్దాంతం. దీనికి తోడు, మెక్సికోలోని ఒక పురాతనమయిన మాయన్ తెగవారు కొన్ని వేల సంవత్సరాల క్రితం రూపొందించుకున్న కేలండర్ సరిగ్గా 2012 డిసెంబర్ 21 నాటికి పూర్తవుతుంది. అంటే ఆ తేదీ తరువాత కేలండర్తో పని వుండదనేది మాయన్ల నమ్మకంగా చెబుతారు. ఇవన్నీ కలగలిపి, ఒక వేళ నిజంగా ఇలా జరిగితే ఎలా వుంటుందనేది మనకి రుచి చూపించడానికి, ఎమ్రిక్ చక్కటి ప్రయత్నం చేసాడు.
ఈ సినిమాలో హీరో జాక్సన్కి అందరికన్నా ముందుగా భూమి వినాశనం గురించి తెలుస్తుంది. వెంటనే అతను తన కుటుంబాన్ని, ఇద్దరు పిల్లల్నీ రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఉత్కంఠని రేకెత్తిస్తాయి. తన కారులో పిల్లల్ని తీసుకు వెళుతూ ఉంటే వెనకాలే భూమి విడిపోవడం, విమానంలో వెళుతుంటే, కళ్ళ ఎదురుగా పెద్ద భవనాలు, ఫ్లై ఓవర్లు కూలిపోవడం వంటివి కంపూటర్ గ్రాఫిక్స్ సహాయంతో ఎంతో అద్బుతంగా తెరకెక్కించారు. భూమి మీద వున్న నాగరికత మనుషులూ అందరూ అంతరించిపోయాక, మరలా కొత్త జీవితం మొదలు పెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పెద్ద పెద్ద షిప్స్ నిర్మించడం, ప్రపంచంలోని అన్ని రంగాలకి చెందిన శాస్త్రవేత్తలని, దేశాధినేతలని, కోటీశ్వరుల్ని ఆ షిప్స్ ద్వారా రక్షించడం వంటి దృశ్యాలు కేవలం ధియేటర్లో మాత్రమే చూడ వలసినవి. కొద్ది సేపటిలో అందరూ చనిపోతామనే భావన వచ్చినపుడు మనుషుల మధ్య సంబందాలు ఎలా వుంటాయి, వారి మానసిక స్తితి ఎలా వుంటుంది, తమ పిల్లల్ని కాపాడడానికి తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలు వంటివి, మానవీయ విలువల్ని కొత్త కోణంలో చూపిస్తాయి. కేవలం గ్రాఫిక్స్ గురించి మాత్రమే కాకుండా చక్కటి విలువలున్న చిత్రంగా కూడా ఈ సినిమా నాకు నచ్చింది.
అమెరికన్ ప్రెసిడెంట్గా ఒబామా స్తానంలో ఒక నల్ల జాతీయుడిని వుంచడం, ఒబామా లాగే తన ప్రజల గురించి అతడు ఆలోచించడం వంటివి ఆలోచింపచేస్తాయి. అమెరికన్ ప్రెసిడెంట్ని ప్రళయం నుంచి రక్షించడం కోసం ప్రత్యేకమయిన ఏర్పాట్లు చేసినా కూడా వాటిని కాదనుకుని, తాను మరణంలోనయినా తన ప్రజలతోనే వుంటానని చెప్పి, చివరకు వారితోనే జలసమాధి కావడం వంటి సంఘటనలని చాలా చక్కగా చిత్రీకరించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే సినిమా చూస్తున్న థ్రిల్ వుండదు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను.
నిజంగా 2012లో ప్రళయం వస్తుందా, రాదా అన్న విషయాన్ని పక్కన పెడితే, కుటుంబ సమేతంగా చూడదగిన చక్కటి సినిమా ఇది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా వున్న ఈ సినిమాని DVD వచ్చే వరకు వెయిట్ చేసేకన్నా, థియేటర్లో చూస్తేనే ఎక్కువ ఎంజాయ్ చేయగలం.
Subscribe to:
Posts (Atom)